ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్మన్ , స్వీపర్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల కాంటిజెన్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిద్ధి రాములు డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేయిస్తున్న
స్వీపర్, వాచ్ మన్, స్కావెంజర్ల కనీస వేతనాలను రూ. 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలానే కాంటిజెన్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్లో ఉన్న మూడేళ్ల జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ధర్నాలో అప్సర్ బేగ్, జ్యోతి పాల్గొన్నారు.