
అధికారులపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై అధికారులు సరిగా పనిచేయకుంటే అధికారుల ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ శ్రీగణేష్ హెచ్చరించారు. సికింద్రాబాద్ మోండా డివిజన్ ఈస్ట్ మారేడ్ పల్లి అంబేత్కర్ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే డ్రైనేజ్ పొంగిపొర్లుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై సీరియస్ అయ్యారు.
వాటర్ వర్క్స్ మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటి ముందు డ్రైనేజ్ పొంగిపొర్లుతుంటే మీరు మీ పిల్లలు ఇలాగే తిరుగుతారా అంటూ ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు..అనంతరం అంబేడ్కర్ నగర్ బస్తీలో విద్యార్థులకు శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు శ్రీగణేష్...అలాగే బోయిన్ పల్లి రామన్న కుంట చెరువును అభివృద్ధి కోసం అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే .