- పిటిషన్పై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు : సంగారెడ్డి జిల్లా కోహిర్ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మార్చేందుకు వీలుగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలనే పిటిషన్ను మంగళవారం టి. వినోద్ కుమార్ విచారించారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ, పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శిలు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
మేజర్ గ్రామ పంచాయతీ కోహిర్ను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ మహ్మద్ ముజాఫర్ హుస్సేన్ పిటిషన్ దాఖలు చేశారు. కోహిర్ గ్రామ సభలో తీర్మానానికి అనుగుణంగా మున్సిపాలిటీగా మార్చాలని కోరారు. ఈ ఏడాది జనవరి 30న ఆఫీసర్లకు వినతిపత్రం ఇస్తే ఫలితం లేదన్నారు.