
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీకి సంబంధించిన జీవో 47ను సవాలు చేస్తూ పిల్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. బస్సు ప్రయాణం ఇబ్బందిగా ఉంటే అది పిల్గా వేయడానికి వీల్లేదని, దానిని రిట్ పిటిషన్గా మార్చాలని ఆదేశించింది. ఫ్రీ జర్నీ వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిందని, ఫ్యామిలీతో కలిసి వెళ్తే బస్సుల్లో నిలబడే పరిస్థితి కూడా లేదని నాగోల్కు చెందిన హరిందర్ ఇటీవల పిల్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కోర్టు స్పందిస్తూ.. ఈ పిటిషన్ ప్రజాప్రయోజనాల కోణంలో లేదని తెలిపింది. ఆఫీసుకు వెళ్లేందుకు ఇబ్బంది ఎదుర్కోవడం వల్లే పిటిషన్ దాఖలు చేశారని అభిప్రాయపడింది. దీనిని తామే విచారిస్తామని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని బెంచ్ ప్రకటించింది.