ఆర్టీసీ ఫ్రీ జర్నీపై పిటిషన్​ను రిట్‌‌గా మార్చండి : హైకోర్టు

ఆర్టీసీ ఫ్రీ జర్నీపై పిటిషన్​ను రిట్‌‌గా మార్చండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో  మహిళలకు ఫ్రీ జర్నీకి సంబంధించిన జీవో 47ను సవాలు చేస్తూ పిల్‌‌ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. బస్సు ప్రయాణం ఇబ్బందిగా ఉంటే అది పిల్‌‌గా వేయడానికి వీల్లేదని, దానిని రిట్ పిటిషన్​గా  మార్చాలని ఆదేశించింది. ఫ్రీ జర్నీ వల్ల బస్సుల్లో రద్దీ పెరిగిందని, ఫ్యామిలీతో కలిసి వెళ్తే బస్సుల్లో నిలబడే పరిస్థితి కూడా లేదని  నాగోల్​కు చెందిన హరిందర్ ఇటీవల పిల్ దాఖలు చేశారు.

పిటిషనర్‌‌ తరఫున లాయర్​ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కోర్టు స్పందిస్తూ.. ఈ పిటిషన్ ప్రజాప్రయోజనాల కోణంలో లేదని తెలిపింది. ఆఫీసుకు వెళ్లేందుకు ఇబ్బంది ఎదుర్కోవడం వల్లే పిటిషన్ దాఖలు చేశారని అభిప్రాయపడింది.  దీనిని తామే విచారిస్తామని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే ఆధ్వర్యంలోని బెంచ్‌‌ ప్రకటించింది.