దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 2వేల మందికి పైగా మృతి

దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 2వేల మందికి పైగా మృతి

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 3,32,730 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,62,63,695కు చేరింది. అదేవిధంగా ఎప్పుడూ లేనంతగా గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,263 మంది చనిపోయారు. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,86,920కు చేరింది. గత 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 1,93,279మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 1,36,48,159కు చేరింది. ప్రస్తుతం దేశంలో 24,28,616 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు కేవలం ఐదు రాష్ట్రాల నంచే నమోదుకావడం గమనార్హం.