రాష్టంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు

రాష్టంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,79,494కు చేరింది. వైరస్ కారణంగా గురువారం 29 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1928కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.

జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 1005 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 373, మేడ్చల్ మల్కాజ్ గిరి 502, నిజామాబాద్‌ 406, మహబూబ్ నగర్‌ 271, రంగారెడ్డి 373, మంచిర్యాల 226, కామారెడ్డిలో 188, ఖమ్మం 152, జనగామ 109, మెదక్ 136, సిద్దిపేట 215 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.