దేశంలో 83 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 83 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 46,254 కేసులు నమోదవడంతో కరోనా కేసులు 83 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 83,13,877 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. మరో 514 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 1,23,611 కు చేరింది. నిన్న ఒక్కరోజే 53,357 మంది కోలుకున్నారు. దీంతో నిన్నటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,56,478 కి చేరింది. ఇంకా 5,33,787 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.