దేశంలో 89 లక్షలకు చేరిన కరోనా కేసులు

దేశంలో 89 లక్షలకు చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 9,37,278 టెస్టులు చేయగా 38,617  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89,12,908 కి చేరింది. మరో 474 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాలు1,30,993 కు చేరాయి. నిన్న మరో 44,739 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 83,35,110 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 4,46,805 మంది ఆస్పత్రిలో ఉన్నారు.