దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు 85 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,674 కేసులు రావడంతో మొత్తం పాజిటివ్ కేసులు 85,07,754 కు చేరాయి. మరో 559 మంది చనిపోవడంతో కరోనా మరణాలు 1,26,121 కు చేరాయి. నిన్న ఒక్కరోజే 49,082 మంది కోలుకున్నారు. దీంతో నిన్నటి వరకు దేశంలో 78,68,968 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 5,12,665 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న దేశ వ్యాప్తంగా 11,94,487 మందికి కరోనా టెస్టులు చేశారు. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య  దేశంలో నిన్నటి వరకు 11 కోట్ల 77లక్షల 36 వేల 791 కు చేరాయి.

ఒక్కడి మాట విని.. ఒకేసారి 900 మంది సూసైడ్‌‌‌‌