దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 16,906 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,36,69,850 కు చేరింది. ఇక దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య1,32,457 కు చేరుకుంది. కొవిడ్ పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉండగా...తాజాగా కరోనాకు 45 మంది బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 5,25,519 కి చేరింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,447 మంది కరోనా నుంచి కోలుకోగా...రికవరీ ల సంఖ్య 4,30,11,874 కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశంలో 1,99,12,79,010 మందికి కొవిడ్ వ్యాక్సిన్లు కేంద్ర ఆరోగ్య శాఖ వేసింది. గడిచిన 24 గంటల్లో 11,15,068 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
COVID-19 | India reports 16,906 fresh cases, 15,447 recoveries, and 45 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 13, 2022
Active cases 1,32,457
Daily positivity rate 3.68% pic.twitter.com/N0n7nPYStY