తెలంగాణలో 1107 కు చేరిన కరోనా మరణాలు

తెలంగాణలో 1107 కు చేరిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1378 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా మరో ఏడుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,87,211కు చేరింది. మరణాల సంఖ్య మొత్తం 1107 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 1932 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,56,431 కు చేరింది. ఇంకా 29,673 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్ననమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 254, రంగారెడ్డిలో 110 ,కరీంనగర్ లో 78 కేసులు నమోదయ్యాయి.

గోనె సంచుల స్కాం.. ఆరేండ్లలో రూ. 620 కోట్లు లూటీ