పివోకేలోని ఉగ్రవాదుల్లో కరోనా వ్యాప్తి

పివోకేలోని ఉగ్రవాదుల్లో కరోనా వ్యాప్తి

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద క్యాంపుల్లో ఉన్న వారిలో కరోనా వ్యాపించిందని…దీంతో కొందరు చనిపోయారని జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు. ఈ కరోనా లక్షణలు ఉన్న టెర్రరిస్టులు భారత్‌లోకి ప్రవేశించి కరోనా వ్యాప్తి చేయాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. కశ్మీర్‌ నుంచి ఉగ్రవాద శిక్షణ కోసం POK వెళ్లిన ఒక వ్యక్తి తన ఇంటికి చేసిన ఫోన్‌ను తాము టాప్‌ చేశామని… అందులో ఈ విషయాలు బయటపడ్డాయని దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు. ఉగ్రవాదులు కరోనా బారిన పడి చనిపోతున్నప్పటికీ పట్టించుకునే వాళ్లు ఎవరూ లేరని ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. పాకిస్తాన్‌ 20 ఉగ్రవాద కేంద్రాలను, 20 టెర్రరిస్టు ల్యాంచ్‌ ప్యాడ్‌లను ప్రస్తుతం పివోకేలో సిద్ధంగా ఉంచిందని.. ఒక్కొ కేంద్రంలో 50 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు.