ఏపీలో 1,679 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో 1,679 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 27,522 శాంపిల్స్ పరీక్షించగా... 1,679 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 350 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 225, గుంటూరు జిల్లాలో 212 కేసులు బయటపడ్డాయి.

 9,598 మంది కరోనా నుంచి కోలుకోగా..ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,08,622 మంది కరోనా బారినపడగా, వారిలో 22,47,824 మంది కోలుకున్నారు. ఇంకా 46,119 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,679కి పెరిగింది.

మరిన్ని వార్తల కోసం..

 

మహిళల భద్రత మా బాధ్యత