వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్

వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ, వెలుగు: వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్‌‌ కన్ఫమ్‌‌ అయ్యింది. ఈ విషయాన్ని వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ ఆఫీస్‌‌ తెలిపింది. రొటీన్‌‌ టెస్ట్‌‌ల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆయనకు చేసిన కరోనా టెస్ట్‌‌లో పాజిటివ్‌‌ రిజల్ట్ వచ్చిందని పేర్కొంది. అయితే, ఆయన హెల్త్‌‌ బాగానే ఉందని, వైరస్‌‌ లక్షణాలు లేవని చెప్పింది. వైద్యుల సూచనతో ఆయన హోం క్వారంటైన్‌‌లో ఉన్నారని వెల్లడించింది. వెంకయ్యనాయుడు భార్య ఉషా నాయుడికి మాత్రం నెగెటివ్‌‌ వచ్చింది. వైరస్ బారి నుంచి వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రులు, అభిమానులు ట్వీట్ చేశారు.

గ్రేటర్ హైదరాబాద్‌‌లో కరోనా కేసులు తగ్గినయ్