తెలంగాణలో 55 లక్షలకు చేరిన కరోనా టెస్టులు

తెలంగాణలో 55 లక్షలకు చేరిన కరోనా టెస్టులు

తెలంగాణలో కొత్తగా 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం  2,70,318 కి చేరింది. నిన్న మరో  ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 1461 కి చేరింది. మరో 894 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య2,59,230 కి చేరింది. ఇంకా రాష్ట్రంలో 9,627 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 7,586 మంది హోంఐసోలేషన్ లో ఉన్నారు. నవంబర్ 30న 46,597 మందికి టెస్టులు చేయడంతో మొత్తం టెస్టుల సంఖ్య 55,00,058 కు చేరింది.