కరోనా బారినపడిన టాలీవుడ్ దర్శకుడు తేజ

కరోనా బారినపడిన టాలీవుడ్ దర్శకుడు తేజ

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ కరోనా కలకలం మొదలైంది. తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బాధితుల్లో ఒకరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. లేటెస్టుగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లారు. తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లొచ్చాడు.

అక్కడే ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండవచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు తేజ కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి  కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో అందరికీ కరోనా నెగెటివ్ అని వచ్చింది.