
కరోనా ఏ వైపు నుంచి, ఎవరి ద్వారా వస్తుందో తెలియడం లేదు. కొందరి అజాగ్రత్త వల్ల , అవగాహన లేకపోవడం వల్ల దీని వ్యాప్తి పెరిగిపోతోంది. ఢిల్లీలో ఓ పిజ్జా బాయ్ నిర్వాకం వల్ల 72 కుటుంబాలు క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఓ ప్రెగ్నెంట్లేడీ ట్రావెల్ హిస్టరీ చెప్పకపోవడం వల్ల 68 మంది డాక్టర్లు, నర్సులు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లాలో గురువారం ఒక్కరోజే 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 14 మందికి
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: సూర్యాపేట జిల్లాలో గురువారం ఒక్కరోజే 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి వైరస్ సోకింది. అలాగే ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరులో ఆరేళ్ల బాలుడికి, తిరుమలగిరిలో ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 39కి చేరుకుంది. ఇందులో 21 కేసులు సూర్యాపేట పట్టణంలోనే ఉన్నాయి. కొత్తగూడెం బజార్ కు చెందిన వ్యక్తికి ఈ నెల 9న పాజిటివ్ వచ్చింది. దీంతో అతడితో కాంటాక్ట్ అయిన 58 మంది శాంపిళ్లను టెస్ట్ లకు పంపించారు. ఇందులో అతడి కుమార్తెకు కరోనా సోకినట్లు సోమవారమే తేలగా, తాజాగా మరో 14 మందికి పాజిటివ్ వచ్చింది.
పిజ్జా డెలివరీతో 72 ఫ్యామిలీలకు
సౌత్ ఢిల్లీలో పిజ్జా డెలివరీ బోయ్ ద్వారా 72 ఇళ్లకు కరోనా వైరస్ పాకినట్లు అనుమానిస్తున్నారు. వీరందరినీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. మాలవీయ నగర్ ఏరియాలో ఉన్న ప్రముఖ పిజ్జా సెంటర్ నుంచి డెలివరీ చేస్తున్న ఒక బోయ్ని పరీక్షించగా అతనికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో అతనితోపాటు 16 మంది డెలివరీ కుర్రాళ్లను కూడా క్వారంటైన్ చేశారు. ఆ తర్వాత అతని ద్వారా ఎన్ని ఇళ్లకు పిజ్జా డెలివరీ జరిగిందో చెక్ చేసి, అన్ని ఇళ్లవారిని హెచ్చరించారు. ‘మొత్తం 72 ఇళ్లకు ఆ పిజ్జా అవుట్లెట్ నుంచి డెలివరీ జరిగినట్లు గుర్తించాం. వారిని ఇళ్లు దాటి బయటకు రాకుండా సెల్ఫ్ క్వారంటైనులోనే ఉండి జాగ్రత్తలు తీసుకోమన్నాం’ అని కలెక్టర్ బి.ఎం.మిశ్రా తెలిపారు.దీంలో గాబరా పడాల్సిందేమీ లేదని, డెలివరీ చేసేవాళ్లంతా ముఖానికి మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా ఉన్నట్లుగా గుర్తించిన డెలివరీ బోయ్ ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతనిని రోజువారీ చెక్ చేస్తున్నారు. కాగా, ఇదే అవుట్లెట్ నుంచి జొమాటో ద్వారా కూడా ఫుడ్ డెలివరీ అయింది. దాంతో అక్కడ పనిచేస్తున్న కుర్రాళ్లను కూడా పరీక్షించగా, వారికి నెగెటివ్ రిపోర్టు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ అవుట్లెట్ను మూసేశారు.
డాక్టర్ మృతి.. 500 మందికి టెస్టులు
అమరావతి, వెలుగు: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఆయన ఓ సీనియర్ డాక్టర్.. ఎన్నో ఏళ్లుగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కరోనా బారినపడి రెండు రోజుల కింద చనిపోయాడు. ట్రావెల్ హిస్టరీ వంటిదేమీ లేని ఆ డాక్టర్కు తాను ట్రీట్ చేసిన పేషెంట్ల నుంచే వైరస్ సోకిందని అధికారులు గుర్తించారు. ఈ నెల 12వ తేదీన తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఆ డాక్టర్ కర్నూల్ హాస్పిటల్కు వచ్చారు. 13న కరోనా ఉన్నట్టు రిపోర్టులు రాగా.. 14న చనిపోయాడు. వారి ఫ్యామిలీకి టెస్టులు చేయగా డాక్టర్ కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది. అసలు ఆ డాక్టర్ కర్నూల్ హాస్పిటల్కు వచ్చే ముందు వరకు కూడా వందల మందికి ట్రీట్మెంట్ చేశారు. దీనిపై అలర్ట్ అయిన అధికారులు.. ఆయన హాస్పిటల్సిబ్బంది, ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్లు, వారి ఫ్యామిలీలు అంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఒక్క రోజే కర్నూల్హాస్పిటల్కు 500 మందికిపైగా వచ్చారు. అధికారులు వారందరికీ కరోనా టెస్టులు చేసే పనిలో పడ్డారు.
హోమ్క్వారంటైన్కు 68 మంది డాక్టర్లు
న్యూఢిల్లీ: ఫారెన్ టూర్ వివరాలను దాచిపెట్టి ఢిల్లీ గవర్నమెంట్హాస్పిటల్లో చేరిన ప్రెగ్నెంట్ బుధవారం రాత్రి చనిపోయింది. దీంతో ఆమెకు ట్రీట్మెంట్చేసిన డాక్టర్లు, నర్సులు మొత్తం 68 మంది హోం క్వారంటైన్లో కి వెళ్లారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిందనే విషయాన్ని దాచిపెట్టిన గర్భణి నార్త్వెస్ట్ఢిల్లీలోని భగవాన్ మహావీర్ హాస్పిటల్లో సోమవారం అడ్మిట్అయ్యింది. బుధవారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ పెట్టామని హాస్పిటల్వర్గాలు వెల్లడించాయి. తాను విదేశాల నుంచి వచ్చానని, వైరస్సోకిన వారితో కలిసి ప్రయాణించానని చెప్పింది. తనతో పాటుగా తన కుటుంబంలో నలుగురిని ఏప్రిల్10 నుంచి 24వ తేదీ వరకు హోం క్వారంటైన్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని తెలిపింది. అయితే ఆమె కరోనా టెస్ట్ రిపోర్టు రావలసి ఉంది.