కౌంటింగ్ కు సర్వం సిద్ధం

కౌంటింగ్ కు సర్వం సిద్ధం

8 గంటలకు కౌంటింగ్ మొదలు
లోక్ సభ ఫలితాలపై అంతటా ఉత్కంఠ

మొదట పోస్టల్ బ్యాలెట్ల గణన
చివర్లో వీవీప్యాట్ల లెక్కింపు
11 గంటల కల్లా ట్రెండ్స్ వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో ఐదారు గంటల ఆలస్యం
రాత్రి పొద్దుపోయాకే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన పోలింగ్ తర్వాత ఓటరు తీర్పు గురువారం వెలువడనుంది. ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ఎన్నికల్లో నేతల భవిష్యత్తు తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టు కుంటుందని జోస్యం చెప్పగా.. ప్రభుత్వ వ్యతిరేకత క్రమంలో మోడీ సర్కారుకు భంగపాటు తప్పదని
ప్రతిపక్షాలు చెబుతున్నాయి.