మృగాళ్ల పైశాచికత్వానికి బలైపోయిన వెటర్నరీ డాక్టర్కు సైబరాబాద్ పోలీసులు ‘దిశ’గా పేరు పెట్టారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాళ్లు ప్రకటించారు. బాధితురాలి అసలు పేరు వాడొద్దని, మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ ‘జస్టిస్ ఫర్ దిశ’గా సంబోధించాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు. ఆమె కుటుంబ సభ్యుల పేర్లను కూడా వినియోగించవద్దని సూచించారు. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.