భూకబ్జా దారులకు అండగా ఉన్న రౌడీలను కట్టడి చేయాలి: సీపీఐ నారాయణ

భూకబ్జా దారులకు అండగా ఉన్న రౌడీలను కట్టడి చేయాలి: సీపీఐ నారాయణ

సికింద్రాబాద్ బేగంపేట్ లోని ప్రకాష్ నగర్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాన్ని సందర్శించిన సీపీఐ నారాయణ.. బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని హామీనిచ్చారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ.. భూకబ్జా దారులకు అండగా ఉన్న రౌడీలను కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు.

ఓ మాజీ మంత్రి ప్రభుత్వ భూముల అక్రమణ దారులకు అండగా ఉన్నాడని ఆరోపించారు. చట్ట ప్రకారం, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుకాబ్జా దారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం ఆయన చేశారు.