పీవీతో కేసీఆర్ ను పోల్చడం దారుణం

పీవీతో కేసీఆర్ ను పోల్చడం దారుణం

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి..సీఎం కేసీఆర్ తో పోల్చడం దారుణమన్నారు సీపీఐ నారాయణ. దేశాన్ని గట్టెక్కించింది పీవీ అయితే, తెలంగాణను కాపాడింది కేసీఆర్ అంటూ వాణీదేవి అన్నారు. అంతేకాదు.. అనేక అంశాల్లో తన తండ్రి పీవీకి, సీఎం కేసీఆర్ కు మధ్య పోలికలు ఉన్నాయంటూ తెలిపారు. దీనిపై నారాయణ తీవ్రంగా స్పందించారు.

వాణీదేవి మాటలకు… పీవీ బతికుంటే ఆత్మహత్య చేసుకునేవారన్నారు. TRS పేరుతో ప్రచారం చేస్తే ఓట్లు వేయరనే పీవీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని నారాయణ విమర్శించారు. పీవీ భుజంపై తుపాకీ పెట్టిన కేసీఆర్… కాంగ్రెస్ ను కాల్చుతున్నారని అన్నారు.

పీవీ కుమార్తె సురభి వాణీదేవి టీఆర్ఎస్ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.