జులై 9న సార్వత్రిక సమ్మె సక్సెస్ చేయాలి: పోతినేని సుదర్శన్

జులై 9న సార్వత్రిక సమ్మె సక్సెస్ చేయాలి: పోతినేని సుదర్శన్

నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ  బంద్ ను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండలోని పెద్ద బండ ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్ లో కొనసాగుతున్న  సీపీఎం నల్గొండ నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో వారు పాల్గొని మాట్లాడారు. 

కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు చేయాలని, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు దండెంపల్లి సత్తయ్య, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, ప్రభావతి పాల్గొన్నారు.