హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేడర్ నుంచి ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్ రిలీవ్ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని డీజీపీ జితేందర్కు సూచించారు. కరీంనగర్ సీపీగా ఉన్న అభిషేక్ మహంతిని మాత్రం ఇంకా రిలీవ్ చేయలేదు.
కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిన తర్వాత రిలీవ్ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.అంజనీకుమార్ ప్రస్తుతం తెలంగాణ రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్గా.. అభిలాష బిస్త్ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సీఎస్ చర్యలు తీసుకుంటున్నారు.
