బషీర్బాగ్, వెలుగు: ఐపీఎల్ టికెట్ల పేరిట జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉప్పల్ స్టేడియంలో ఈనెల 22న జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్– రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి మ్యాచ్కు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్లు, వెబ్సైట్లతో మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్’ యాప్ను పోలిన లోగోలతో సోషల్ మీడియాలో తక్కువ ధరలకే టికెట్లు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అనధికారిక లింకులను నమ్మి బుక్ చేసుకుంటే డబ్బులతో పాటు బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ కేటుగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
