చోరీ కేసులో పట్టుబడ్డ గోల్డ్ మెడల్ విద్యార్థి

చోరీ కేసులో పట్టుబడ్డ గోల్డ్ మెడల్ విద్యార్థి

హైదరాబాద్:  నగరంలో యవత పక్కదారి పడుతోంది. పీజీలకు పీజీలు చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఈజీ మనీ కోసం వెంపర్లాడుతోంది. దీంతో  చోరీలు చేస్తూ పోలీసులకు దొరికిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.  సైబరాబాద్ పరిధిలో ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఘరానా దొంగలను పోలీసులు  అరెస్ట్ చేశారు. అందులో ఎంబీఏ ( HR) పూర్తి చేసి గోల్డ్ మెడల్  సాధించిన ఓ యువకుడు  పట్టుబట్టాడు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకొని చోరీలు చేస్తున్న అతను 38 పైగా చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు  చేసిన అతని నుండి 800 గ్రాములు బంగారం, లక్ష యాభైవేల నగదు స్వాదీనం చేసుకున్నారు. కాసేపట్లో అతన్ని మీడియా ముందు ప్రవేశ పెడతామని పోలీసులు చెప్పారు.