సిలిండర్ పేలి.. 11 మందికి తీవ్రగాయాలు

సిలిండర్ పేలి.. 11 మందికి తీవ్రగాయాలు

హైదరాబాద్ లో పేలుడు సంభవించింది. నగరంలో ఐటీ కారీడార్ కు కూతవేటు దూరంలో ఉన్న నానక్ రాంగూడలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని గ్రౌండ్ ప్లోర్ లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలుకాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి భవనంలోని పలు గదులు కూలిపోయాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, జీహెచ్ఎంసీ, డిఆర్ఆఫ్ అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. సిలిండర్ పేలుడుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన ఇంట్లో కూలీలు అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది.  ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ సీజ్ చేస్తామంటున్నట్లు సమాచారం.