హైదరాబాద్లో కరోనా పరిస్థితిపై గవర్నర్ కలగజేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ కోరారు. కరోనాపై చర్చించేంందుకు గవర్నర్ పిలుస్తుంటే వెళ్లకుండా సీఎస్ రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి మృతదేహాలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు షబ్బీర్ అలీ. కరోనా కేసులు భారీగా పెరుగుతూ పరిస్థితి దిగజారుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాజ్యం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న రోమ్ చక్రవర్తి మాదిరిగానే సీఎం కేసీఆర్ వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ -8ను అమలు చేసి, గవర్నర్ తన అధికారాలను వినియోగించుకోవాలని లేఖ రాస్తామని చెప్పారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. హైదరాబాద్లో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరారు. సచివాలయం కూల్చివేత విషయంలోనూ కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారాయన. దొంగలెక్క అర్ధరాత్రి వేళ సెక్రటేరియట్ కూల్చివేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మంచిగా ఉన్న బిల్డింగ్ను కూల్చివేయడం ఎందుకని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతోనే ఆగమేఘాలపై కూల్చేశారని ఆరోపించారు.
హైదరాబాద్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: షబ్బీర్ అలీ
- తెలంగాణం
- July 7, 2020
లేటెస్ట్
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో...
- Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
- పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే
- ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్గా భూపాలపల్లి
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది