
చాలా మంది సెలబ్రిటీలు అభిమానుల మధ్య తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. ఒక్కోసారి తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లేందుకు మారువేషాల్లో తిరుగుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ముంబైలోని ఓ సినిమా థియేటర్లో ప్రత్యక్షమైంది. పఠాన్ మూవీ సంచలన విజయం సాధించడంతో ప్రేక్షకుల స్పందనను చూసేందుకు ఆమె మారువేషంలో ఐకానిక్ గైటీ గెలాక్సీకి వచ్చారు. బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుని.. తన ముఖం కనిపించకుండా నల్లటి మాస్క్ ధరించి.. టోపీని పెట్టుకుని థియేటర్లోకి వచ్చారు. అప్పటికే ఆమెను గుర్తుపట్టిన కొందరు ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ' పఠాన్ ' 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.429 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి 2, KGF 2 చిత్రాలను అధిగమించి అత్యంత వేగంగా రూ. 200 కోట్ల క్లబ్లోకి ఈ మూవీ చేరింది. ఈ చిత్రంలో దీపికతో పాటు జాన్ అబ్రహం, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించారు.