ఇచ్చోడ: ప్రైవేట్ కాలేజీలో చదివించలేదని ఆదిలాబాద్ జిల్లాలో ఓ డిగ్రీ స్టూడెంట్ఉరి వేసుకుంది. ఎస్సై ఉదయ్కుమార్తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని తలమద్రి గ్రామానికి చెందిన గులె పూజ(19) ఇచ్చోడలోని సోషల్వెల్ఫేర్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. 20 రోజుల కింద కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసింది. తాను సోషల్ వెల్ఫేర్ కాలేజీలో చదవనని, ప్రైవేట్కాలేజీలో చేర్పించమని పేరెంట్స్ను కోరింది. సెకండ్ఇయర్పూర్తి చేయమని, థర్డ్ఇయర్కు అలానే చేర్పిస్తామని పేరెంట్స్ నచ్చజెప్పారు. దీంతో మనస్తాపం చెందిన పూజ గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లాక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చాక చనిపోయి దూలానికి వేలాడుతున్న కూతురిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తండ్రి గులె శంకర్ శుక్రవారం పోలీసులకు కంప్లయిం ట్ చేశాడు.