ప్రైవేట్ కాలేజీలో చదివించలేదని సూసైడ్​

ప్రైవేట్ కాలేజీలో చదివించలేదని సూసైడ్​

ఇచ్చోడ: ప్రైవేట్ కాలేజీలో చదివించలేదని ఆదిలాబాద్ జిల్లాలో ఓ డిగ్రీ స్టూడెంట్​ఉరి వేసుకుంది. ఎస్సై ఉదయ్​కుమార్​తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని తలమద్రి గ్రామానికి చెందిన గులె పూజ(19) ఇచ్చోడలోని సోషల్​వెల్ఫేర్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. 20 రోజుల కింద కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసింది. తాను సోషల్​ వెల్ఫేర్​ కాలేజీలో చదవనని, ప్రైవేట్​కాలేజీలో చేర్పించమని పేరెంట్స్​ను కోరింది. సెకండ్​ఇయర్​పూర్తి చేయమని, థర్డ్​ఇయర్​కు అలానే చేర్పిస్తామని పేరెంట్స్​ నచ్చజెప్పారు. దీంతో మనస్తాపం చెందిన పూజ గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లాక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చాక చనిపోయి దూలానికి వేలాడుతున్న కూతురిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తండ్రి గులె శంకర్ శుక్రవారం పోలీసులకు కంప్లయిం ట్ ​చేశాడు.