చిదంబరానికి బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

చిదంబరానికి బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేత చిదంబరానికి మరోసారి నిరాశ ఎదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ(సోమవారం) ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. సాక్షులను చిదంబరం ప్రభావితం చేసే అవకాశముందని సీబీఐ తెలపడంతో సీబీఐ వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. బెయిల్ మంజూరు చేయాలంటూ చిదంబరం గత బుధవారం పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైల్లో ఉన్నారు.