బాధిత మహిళల వివరాలు ఇస్తే.. చర్యలు తీసుకుంటాం : ఢిల్లీ పోలీస్ 

బాధిత మహిళల వివరాలు ఇస్తే.. చర్యలు తీసుకుంటాం : ఢిల్లీ పోలీస్ 

ఢిల్లీలోని రాహుల్ గాంధి నివాసం ముందు భారీగా పోలీసులు, ఉన్నతాధికారులతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ మధ్య భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్ లో పర్యటించిన రాహుల్.. మహిళలపై ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, యాత్రలో చాలామంది మహిళలు తనతో ఈ విషయం చెప్పారన్నారు. దాంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ విషయంపై స్పంధించిన స్పెషల్ పోలీస్ కమిషనర్ సారగ్ ప్రీత్.. పోలీస్ ఉన్నతాధికారులతో రాహుల్ ఇంటికి వెళ్లారు. బాధిత మహిళల వివరాలు ఇవ్వాలని, తక్షనమే నిందితులపై చర్యలు తీసుకుంటామని కోరుతున్నారు.

అయితే, ఈ అంశంపై పోలీసులు రాహుల్ మార్చి 15నే కలవాలనుకున్నారు. కానీ, వీలు పడలేదు. తర్వాత మార్చి 16న రాహుల్ కి నోటీసులు పంపారు. ఇప్పుడు వాళ్లే స్వయంగా రాహుల్ ఇంటికి వెళ్లి వివరాలివ్వమని అడగటం చర్చనీయాంశంగా మారింది.