
- అందుకోసం ప్రత్యేక అధికారిని నియమించండి
- పురోగతిపై వచ్చే వారం మళ్లీ సమీక్ష
- రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి
హైదరాబాద్: నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నిర్మించాలని ఆదేశించారు.
తన అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో శాఖల వారీగా అంశాలను ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ సమావేశం ప్రతివారం జరుగుతుందని, తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
గురువారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిని వచ్చేవారం సమావేశంలో అంశాల వారీగా సమీక్షిస్తామన్నారు. సబ్ కమిటీ సభ్యుడు జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.