
హైదరాబాద్ లో కల్తీ ఫుడ్, క్వాలిటీ లేని ఫుడ్ తో సామాన్యుల ప్రాణాలు తీస్తున్నారు హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. బయట ఫుడ్ తినాలంటేనే భయపడేలా చేస్తున్నారు. ఇష్టారీతిన హోటల్స్ నడుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
లేటెస్ట్ గా తార్నాకలోని డెక్కన్ పామ్ రెస్టారెంట్ లో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్ కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన చికెన్ తో బిర్యానీ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు.
రెస్టారెంట్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ మేయర్ శ్రీలత. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్స్, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.