
ఆను నెలలు స్నేహం చేస్తే వాళ్లు వీళ్లవుతారు. వీళ్లు వాళ్లవుతారని అంటారు. కానీ ఆ ఆరు నెలలు ఎలాంటి వాళ్లతో స్నేహం చేశాం? ఏం నేర్చుకున్నాం? ఏం కోల్పోయాం? అవి మాత్రం ఆలోచించడం లేదు నేటి తరం యూత్.. . నాకు వాళ్ల వల్ల ఎంత లాభం వచ్చింది? ఎంతవరకు ఉపయోగపడ్డారు? అని మాత్రమే ఆలోచించాలి.
ఒక్కోసారి మిత్రులవల్ల జీవితాలు బాగుపడతాయి. అప్పుడే నిజమైన సంతోషం అంటే ఏంటో తెలిసొస్తుంది. కాని నేటి తరం కలిశామా.. హాయ్ .. చెప్పుకున్నామా.. పార్టీ చేసుకున్నామా..బైబై చెప్పుకున్నామా అనే రీతిలో ఉన్నారు. ఈ స్టోరీలో అసలు నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే ఏమిటో తెలుసుకుందాం. .
కాలికి మట్టి అంటకుండా ఏసీ కారు.... పెద్దపెద్ద బంగ్లాల్లో బతుకుతున్నా మనుషులు ఇంకా సంపాదించాలని... ఇంకా కావాలని ఆశల వెంట పరుగులు తీస్తున్నారు. 'నా ఫ్రెండ్స్" అని గర్వంగా చెప్పుకునే వాళ్లు కూడా దాన్నే ఎంకరేజ్ చేస్తున్నారు. నిజమైన సంతోషం గురించి ఎవరుచెప్పడం లేదు. అలా చెప్పే ఆత్మీయులూ ఉండటం లేదు. మంచి మిత్రులు అంటే.. చేస్తున్న తప్పుల గురించి చెప్పాలి. మంచి మార్గం వైపు నడిపించాలి. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటున్నారు..
చాలామంది రోజంతా తీరిక లేకుండా గడుపుతారు. ఇంట్లోవాళ్లకే ..స్నేహితులకూ టైం ఇవ్వరు.. . ఎందుకు జీవిస్తున్నారో? ఎలా బతుకుతున్నారో? ఆలోచించకుండానే బతికేస్తుంటారు. డబ్బు, సుఖం కోసం వెంపర్లాడుతుంటారు. తప్ప, నిజమైన జీవితం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ప్రపంచం ఎటు పోతుంటే అటు పోతూ తామే గొప్పవాళ్లమని, గొప్ప పనులు చేస్తున్నామని అనుకుంటారు. ఇదే విషయం గురించి శ్రీరాముడు, తన గురువు వశిష్టునితో చర్చిస్తారు. నాకు లోకం పోకడ చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది.
ప్రజలందరూ వాళ్ల వాళ్ల జీవితాలకు సంబంధించి ఏవేవో పనులు పెట్టుకుని వాటితో పగలు. రాత్రి అనే తేడాలేకుండా గడుపుతున్నారు. మంచి వాళ్లతో స్నేహం చేయకుండా, మంచి పనులు చేయకుండా రాత్రికల్లా ఇంటికి చేరుకుంటున్నారు. ఎలా బతకాలో కూడా తెలుసుకోకుండానే రోజును గడిపేస్తున్నారు. కానీ ఈ రోజు జీవితం గురించి ఏం నేర్చుకున్నాను?. దాన్నించినన్ను నేను' ఎలా మార్చుకున్నాను? అని మాత్రం. ఆలోచించడం లేదు' అంటాడు. ఇప్పటి సమాజంలో కూడా ఎక్కువమంది అలాగే బతికేస్తున్నారు. అందుకే మంచి స్నేహితుల అవసరం ఎంతైనా ఉంది.
అన్నింటికీ ఓకే అనకూడదు
మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడి స్నేహాన్ని ఇప్పటి వాళ్లు కూడా ఆదర్శంగా తీసుకోవాలంటారు. అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడు అవమానం ఎదుర్కొన్నప్పుడు దుర్యోధనుడు అతడికి అండగా నిలబడి, అంగరాజ్యానికి రాజును చేస్తాడు. ఆ మేలును కర్ణుడు జీవితాంతం మర్చిపోడు. చివరకు యుద్ధంలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటాడు.
కానీ దుర్యోధనుడు చేసే జూదం ద్రౌపదిని నిండుసభలో అవమానించడం లాంటి చెడు పసులకు అడ్డుచెప్పుడు మంచి మార్గంవైపు మళ్లించదు. జీవితాంతం నీకు తోడు ఉంటానని దుద్యోధనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి మాత్రమే ఉంటారు. ఇలాంటి స్నేహితుల వల్ల జరిగే మేలుకుంటే, నష్టమే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్నేహితులు మంచి పనుల్లో అండగా ఉండాలి. చెడు పనులకు అడ్డుపడాలి. అలాంటి మిత్రులున్నవాళ్లు. జీవితంలో ముందుకెళ్లారు. మంచివాళ్లుగా పేరు తెచ్చుకుంటారు.
మనకెందుకులే.. అనిఈ రోజుల్లో ఎక్కువమంది తమ గురించి తాము పట్టించుకున్నంతగా స్నేహితుల గురించి పట్టించుకోరు. కానీ నిజమైన స్నేహితులు అలా ఉండరు మంచి చెడుల గురించి వివరించి చెప్తారు. తప్పుదోవలో పోతుంటే. చేయి పట్టుకుని మంచివైపు నడిపిస్తారు. వినకపోతే అరిచైనా.. కోపగించుకొనైనా చెప్తారు. కానీ ఈ రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునేవాళ్లు కూడా తమ స్నేహితుడి గురించి పట్టించుకోవడం లేదు. `నా కెందుకులే. నాకు అవసరమైనప్పుడు సాయం చేస్తే చాల్లే అని మాత్రమే చూసుకుంటున్నారు.
రామకృష్ణ పరమహంస ఎలాంటి స్నేహితులు ఉండాలో చెప్తూ ఎప్పుడూ చుట్టూ మంచి వాళ్లు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మొసలి నీళ్లలోంచి బయటకొచ్చే, ఊపిరి పీల్చుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ మంచి స్నేహితుల దగ్గర ప్రశాంతత పొందాలి. మంచి స్నేహితులు జీవితంలో వచ్చిన కష్టాల నుంచి కాపాడడమే కాదు, అనుమానాలు కూడా తీరుస్తారు" అని చెప్తాడు. స్వార్థంతో ఆలోచిస్తూ కేవలం సొంతలాభం మాత్రమే చూసుకునే ఫ్రెండ్స్ ఉంటే వాళ్లకు దూరంగా ఉండటమే మంచిది.
లోపలికి చూస్తే..
"ఎలా ఉన్నావు?" అని ఎవర్ని అడిగినా పైకి మాత్రం 'నాకేం" చాలా బాగున్నా అంటారు. కానీ కాస్త నెమ్మదిగా ఒక మిత్రుడిలా, కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ పలకరిస్తే తనలో ఉన్న బాధంతా చెప్పుకుంటారు. ప్రస్తుతం స్కూలుకు వెళ్లే పిల్లాడి నుంచి డెబ్బై ఏళ్ల పెద్దవాళ్ల వరకు ఏదోఒక ఆందోళనలో బతుకుతున్నారు.
టీవీ, సెల్ ఫోన్, సినిమా. అనేక ప్రలోభాల్లో పది తామేంటో తామే తెలుసుకోలేకపోతున్నారు. కోరికల చుట్టూ తిరుగుతున్నారు. చెడు అలవాట్లు.. రకరకాల వ్యాపకాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ అలాంటి కోరికలను వదిలి పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు.
ఇలాంటి ప్రలోభాల నుంచి మంచి స్నేహితులను కాపాడడమే మంచి మిత్రులు చేయాల్సిన పని భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషికి కలిగే కోరికల గురించి చెప్తూ... 'విషయాలపై కోరక పెంచుకుంటే వాటిపై ఆసక్తి కలుగుతుంది. అవి కావాలనుకుంటారు. అవి దక్కకపోతే కోపం వస్తుంది. దాంతో ఆవేశం వచ్చి, ఎలా ప్రవర్తిస్తున్నారో మర్చిపోతారు. దాంతో మంచిచెడుల గురించి ఆలోచించే బుద్ధి నశిస్తుంది' అని చెప్తాడు. అందుకే ఎప్పుడూ మనిషి తన గురించి తాను ఆలోచించుకుంటూ ఉండాలి. అలా కుదరనప్పుడు మంచి మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి అలాగే లోపలి మనిషిని. .అంచనా వేసి, సలహాలిచ్చే ఫ్రెండ్స్ ఉండాలి
దారి చూపే స్నేహితులు
ప్రతిఒక్కరూ సంతోషంగా బతకాలి. చెడ్డ పనులు చేయకూడదు, అందరూ మెచ్చుకోవాలి' అని తమ గురించి తాము అనుకుంటారు. కాని తీరా ఆచరించాల్సి వచ్చేసరికి అలా బతకరు. స్వార్థంతో ఆలోచించి, తమ సుఖం తాము చూసుకుంటారు. వాళ్లు బతకడమే కాదు, స్నేహితుల్ని కూడా చెడు వైపు లాగుతుంటారు. కానీ మంచి ఫ్రెండ్స్ చెడ్డవాళ్లను మంచి వాళ్లుగా మారుస్తారు.
ఇదే విషయం గురించి ఆదిశంకరాచార్యులు భజ గోవిందంలో మంచివాళ్లతో స్నేహం చేయడం వల్ల మంచి వాళ్లుగా మారొచ్చు. ప్పటి వరకు చేసిన తప్పులు సరిదిద్దుకోవచ్చు. అహంకారం తొలిగించుకోవచ్చు. తప్పు ఒప్పుల గురించి కచ్చితంగా తెలుసుకుని.. మంచిపనులు చేయడం నేర్చుకోవచ్చు. మితిమీరిన కోరికల నుంచి బయేటపడొచ్చు' అని చెప్తాడు. అందుకే ఎప్పుడూ మంచి వాళ్లతో స్నేహం చేయాలి. చుట్టూ మంచి వాళ్లు ఉంటే, ఎంత చెడ్డవాళ్లైనా తప్పకుండా మంచి వాళ్లుగా మారతారు..
–వెలుగు,లైఫ్–