Local T20 League: లక్నో మిస్టరీ స్పిన్నర్ సంచలనం: 5 బంతుల్లో 5 వికెట్లు.. 5 నిమిషాల్లో ఇన్నింగ్స్ ఖతం

Local T20 League: లక్నో మిస్టరీ స్పిన్నర్ సంచలనం: 5 బంతుల్లో 5 వికెట్లు.. 5 నిమిషాల్లో ఇన్నింగ్స్ ఖతం

లక్నో సూపర్ జెయింట్స్ మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ 2025 లో అద్భుతమైన బౌలింగ్ తో విచిత్ర ఆటిట్యూడ్ తో పలుమార్లు జరిమానాకు గురయ్యాడు. ప్రత్యర్థికి జట్లపై వికెట్ తీసిన ప్రతిసారి నోట్ బుక్ సెలెబ్రేషన్ చేసుకుంటూ ఒక్కసారిగా వైరల్ గా మారాడు. ఈ క్రమంలో పలుమార్లు నిషేధానికి గురయ్యాడు. అంతేకాదు ఈ లెగ్ స్పిన్నర్ తన ఓవరాక్షన్ తో ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఇదంతా పక్కనపెడితే మరోసారి దిగ్వేశ్ వైరల్ అవుతున్నాడు. ఈ సారి సెలెబ్రేషన్ తో కాదు తన అత్యద్భుతమైన బౌలింగ్ కారణంగా ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు.       

ALSO READ | James Anderson: కోహ్లీ, సచిన్‌లలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం.. అండర్సన్ సమాధానమిదే!

లోకల్ టీ20 లీగ్ లో భాగంగా 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి సంచలనంగా మారాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన దిగ్వేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ ఛేజింగ్ లో ప్రత్యర్థి జట్టు 14 ఓవర్లు ముగిసేసరికీ 5 వికెట్ల నష్టానికి 151 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తోంది. గెలవాలంటే విజయానికి చివరి 36 బంతుల్లో 113 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో 15 ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన దిగ్వేశ్ తన తొలి బంతుల్లో వికెట్లను తీసుకోవడం విశేషం. ఈ మిస్టరీ స్పిన్నర్ ధాటికి ప్రత్యర్థి వద్ద సమాధానమే లేకుండా పోయింది. 

చూస్తుండగానే 5 నిమిషాలలోపే ఇన్నింగ్స్ ముగిసింది. దిగ్వేశ్ తీసిన 5 వికెట్లతో నాలుగు క్లీన్ బౌల్డ్ అవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ లక్నో సూపర్ జయింట్స్ స్పిన్నర్ బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే ముగిసిన 2025 ఐపీఎల్ లో అదరగొట్టిన దిగ్వేశ్.. 13 మ్యాచ్‌ల్లో 30.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్, దిగ్వేష్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు ఒకరిపైకి మరొకరు దూసుకువచ్చారు. వెంటనే అంపైర్లు, ఇతర ఆటగాళ్లు కలగజేసుకుని ఇద్దరిని సముదాయించారు. మ్యాచ్ తర్వాత  దిగ్వేష్ రతిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాకుండా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది.