కాషాయం వేసుకుని రేప్ లు చేస్తున్నారు: దిగ్విజయ్

కాషాయం వేసుకుని రేప్ లు చేస్తున్నారు: దిగ్విజయ్

సనాతన ధర్మాన్ని కించపరిస్తే.. దేవుడు క్షమించడు

Digvijaya Singh at it again; says rapes are happening inside templesకాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మంగళవారం వార్తల్లో నిలిచారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొంతమంది కాషాయం వేసుకుని రేప్ లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో కూడా అత్యాచారాలు చేస్తున్నారని అన్నారు. ఇదేనా ‘మన ధర్మం’ చెప్పేది అంటూ ప్రశ్నించారు. హిందూ మతాన్ని కొంత మంది అభాసుపాలు చేస్తున్నారని అన్నారు.  ఈ రకమైన చర్యలతో సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేవుడు కూడా క్షమించడని దిగ్విజయ్ అన్నారు.

పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ నుంచి బజరంగ్ దళ్, బీజేపీలకు డబ్బులు అందుతున్నాయని, దీనిపై నిఘా పెట్టాలని అంటూ గత నెలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.