నాలుగేళ్ల తర్వాత పల్లికల్ రీఎంట్రీ

నాలుగేళ్ల తర్వాత పల్లికల్ రీఎంట్రీ

న్యూఢిల్లీ: నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టేందుకు ఇండియా స్క్వాష్ స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ సిద్ధమైంది. క్రికెటర్ దినేశ్ కార్తీక్ ను పెండ్లి చేసుకున్న దీపిక నిరుడు అక్టోబర్ లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. కొంతకాలంగా ఫ్యామిలీకే ఫుల్ టైమ్ కేటాయించిన ఈ ప్లేయర్.. మళ్లీ బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అందుకోసం రెండు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్న పల్లికల్.. ఏప్రిల్​లో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్స్‌‌‌‌తో రీఎంట్రీ ఇవ్వనుంది. అలాగే, ఈ ఏడాది జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌‌, ఏషియన్ గేమ్స్ పై  ఫోకస్ పెట్టినట్లు దీపిక చెప్పింది. కామన్వెల్త్ గేమ్స్‌‌లో కేవలం డబుల్స్ లోనే పోటీపడాలని భావిస్తున్న 31 ఏళ్ల దీపిక.. వర్క్ లోడ్ ను నెమ్మదిగా పెంచుకుంటూ ఏషియన్ గేమ్స్ లో సింగిల్స్ లోనూ బరిలోకి దిగాలని చూస్తున్నట్లు తెలిపింది.