పోలీసుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్

పోలీసుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్

ఎన్ కౌంటర్ పై జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హాజరయ్యారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు. పోలీసుల నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కమిషన్ కు  చెప్పారు. కాచిగూడ హోటల్ లో బస చేస్తే బలవంతంగా ఖాళీ చేయించారని కమిషన్ కు వివరించారు. మరోవైపు కమిషన్ కు అఫిడవిట్ రూపంలో  నివేదిక సమర్పించారు అడ్వకేట్స్. సాక్షులకు భద్రతా లేకుండా పోయిందని కమిషన్ కు చెప్పారు. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలన్నారు. కేసు విచారణ ఆలస్యం కావడంతో న్యాయం జరగడం లేదన్నారు.కేసు విచారణ త్వరగా పూర్తి చేసిన నిందుతుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు.