మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్  ఎల్‌పీజీ సిలిండర్‌ ధరపై  రూ. 50, 19 కేజీ కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ. 350.50 పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో  డొమెస్టిక్ సిలిండర్‌ ధర రూ.1,155 కు చేరుకుంది. కాగా ఈ ఏడాది కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెరగడం ఇది రెండోసారి. ఇప్పటికే నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఆ భారం మరింత పడనుంది.