అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా పై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష కార్యాలయమైన వైట్ హైజ్ లో పలు దిగ్గజ మీడియా పత్రికల్ని నిలిపివేయాలంటూ హుకుం జారీ చేశారు. ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు సైతం ఆ పత్రికలను చదవకూడదని ఆదేశించారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం..జర్నలిస్ట్ లు ప్రజల శత్రువులు అని అభివర్ణించినట్లు ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ట్రంప్ విమర్శించే వాటిని ప్రచురించడాన్ని నకిలీవిగా గుర్తించాలని ట్రంప్ అన్నట్లు తెలిపింది.
20 ఏళ్లుగా వైట్ హౌజ్ కు వచ్చే వాషింగ్ టన్ పోస్ట్ , ది న్యూయార్క్ టైమ్స్ నిలిపివేయాలని ట్రంప్ అన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. వైట్ హౌజ్ లో ఈ న్యూస్ పేపర్లు ఉండేందుకు వీల్లేదని ట్రంప్ అన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
