మృతుడి కళ్లు దానం

మృతుడి కళ్లు దానం

వరంగల్ వెలుగు: మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి, హీరో షోరూం యజమాని నాశిరెడ్డి వినయ్ కుమార్ రెడ్ డి హైదరాబాద్ లో జరిగిన యాక్సిడెంట్ లో శుక్రవారం చనిపోయారు. ఆయన కండ్లను తల్లిదండ్రులు నాశిరెడ్డి వెంకటరమణ విజయభాస్కర్ రెడ్డి హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు దానం చేశారు. కొడుకును పోగొట్టుకున్న పుట్టెడు దుఃఖంలోనూ నేత్రాలను దానం చేసిన వాళ్లను పలువురు అభినందించారు.