సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దు: హరీశ్

సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దు: హరీశ్

సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దన్నారు మంత్రి హరీశ్ రావు. తన స్వార్థం కోసం ఈటల పార్టీ వదిలిపెట్టారన్నారు. గెలిస్తే ఏం చేస్తారో బీజేపీ చెబుతందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే కరెంట్ తిప్పలు పోయ్యాయన్నారు. మంత్రిగా ఉండి హుజరాబాద్ లో ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. మంత్రిగా పనిచేయలేనోడు.. ఎమ్మెల్యేగా ఏం చేస్తారో ప్రజలే ఆలోచించాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని బొత్తలపల్లిలో హరీశ్ మాట్లాడారు.