
- ఒకేసారి దంపతుల అంత్యక్రియలు
- సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాలనీలో విషాదం
జిన్నారం, వెలుగు: భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకోగా.. ఒకేసారి అంత్యక్రియలు చేసిన విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. జిన్నారం మండలం బొల్లారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన గొల్ల గణేశ్(55), అమరావతి(47) దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు.
గణేశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, తట్టుకోలేక శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతిని తట్టుకోలేని భార్య కూడా సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. దీంతో దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. భార్యాభర్తలకు బంధువులు, గ్రామస్తులు ఒకేసారి అంత్యక్రియలు పూర్తి చేశారు.