రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న ద్రౌపది ముర్ము

రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న ద్రౌపది ముర్ము

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం 21 గన్ సెల్యూట్‌లతో గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 

ఉదయం 8.30 గంటలకు ద్రౌపది ముర్ము రాజ్ ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించనున్నారు. అనంతరం రాజ్ ఘాట్ నుంచి తాత్కాలిక నివాసానికి చేరుకుని అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్తో కలిసి ఉదయం 10.10కల్లా పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు చేరుకుంటారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత రాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలతో పాటు త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారం ముగిసిన అనంతరం ముర్ము రాజ్ భవన్ కు వెళ్లి అక్కడ గౌరవ వందనం స్వీకరించనున్నారు.