మద్యం మత్తులో యువతుల హల్ చల్‌

మద్యం మత్తులో యువతుల హల్ చల్‌

హైదరాబాద్‌: ఫూటుగా మద్యం సేవించిన నలుగురు యువతులు చైతన్యపురి కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో హల్ చల్‌ చేశారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు చైతన్యపురిలోని కనకదుర్గ వైన్స్‌ ఎదురుగా ఉన్నబస్‌స్టాప్‌లో తిష్ట వేశారు. వైట్‌నర్‌ పీల్చుతూ మద్యం కొనేందుకు వచ్చిన వారితో, రోడ్డు వెంట వెళ్తున్నవారితో అకారణంగా గొడవకు దిగారు. వారిపై దాడులు కూడా చేస్తూ నానా హంగామా సృష్టించారు.