తాగిన మత్తులో కొడవలితో దాడి.. ఒకరి పరిస్థితి విషమం

తాగిన మత్తులో కొడవలితో దాడి.. ఒకరి పరిస్థితి విషమం

తాగిన మత్తులో ఇద్దరు యువకులపై దాడి చేశాడు ఒకతను. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ దర్మపురి కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దయాకర్ అనే అతను తాగిన మత్తులో చిరంజీవి(28), తరుణ్ (17) అనే యువకులపై కొడవలితో దాడి చేశాడు. దీంతో వీరిని స్థానికులు గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి విషమంగా ఉందని… దయాకర్ కు తీవ్రగాయాలయినట్లు చెప్పారు డాక్టర్లు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.