వెన్నతో చేసిన పరాఠాను గడ్డ పెరుగుతో కలిపి తింటే స్వర్గానికెళ్లినంత హాయిగా ఉంటుంది కదా. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని మీకు తెలుసా..?పెరుగును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినొద్దన్న విషయం మీకు తెలుసా..? చాలా ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తినేటప్పుడు రుచిగా అనిపించినా అవి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దహీలో ముఖ్యంగా ప్రోబయోటిక్స్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పరాటా, మామిడి, ఉల్లిపాయలతో సహా కొన్ని పదార్థాలతో కలిపి పెరుగును కలిపి తీసుకున్నపుడు దాని ఆమ్ల స్వభావం అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ ఆహార కలయిక అసిడిటీ, ఉబ్బరం. ప్రేగు సంబంధిత సమస్యలకు దారితీస్తుంద. అంతే కాదు ఇది జీర్ణవ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఆహార కలయిక: దహీతో పాటు కలిపి తినకుండా ఉండవలసిన 7 ఆహారాలు:
ఆయుర్వేదం ప్రకారం, ఒకదానితో ఒకటి సరిపోలని ఆహార జంటలను 'విరుద్ అన్న' అని పిలుస్తారు. ఈ ఆహారాలు వ్యతిరేక లక్షణాల కారణంగా విరుద్ధమైన చర్యలను చూపిస్తుందని కన్సల్టెంట్ పోషకాహార నిపుణుడు రూపాలి దత్తా చెబుతున్నారు. వీటిలో కొన్ని పదార్ధాలు వేడిగా, మరికొన్ని చల్లగా ఉండవచ్చు లేదా రెండు పదార్ధాలు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి.. అలాంటి ఆహార పదార్ధాలు కలిపి తిన్నప్పుడు, పలు అనారోగ్యాలకు దారితీయవచ్చని దత్తా తెలిపారు. మీ రోజువారీ ఆహారంలో పెరుగుతో కలపకూడని కొన్ని సాధారణ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1.బెల్లం, పెరుగు:
బెల్లం చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. అందువల్ల, చాలా మంది ప్రజలు తమ రోజువారీ భోజనంలో (చక్కెర స్థానంలో) పోషకాలను సమృద్ధిగా పొందడానికి బెల్లంను వాడుతుంటారు. అయితే మీరు దహీని బెల్లంతో జత చేసినప్పుడు అది బరువు పెరగడానికి దారితీస్తుంది (బరువు తగ్గడానికి బదులుగా). బెల్లం ప్రకృతిపరంగా వేడిగా ఉంటుంది. దహీ చల్లగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కారకాలు దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలకు దారితీస్తాయి.
2. పాలు, పెరుగు:
దహీని ఎప్పుడూ పాలతో కలపకూడదు. "ఎటువంటి పులియబెట్టిన పదార్థాలను(ఇక్కడ: పెరుగు) పాలతో తినకూడదు. ఎందుకంటే ఇది శరీరంలోని ప్రసార వ్యవస్థను అడ్డుకుంటుంది. అంతే కాదు వీటి కలయిక వల్ల ఇన్ఫెక్షన్లు, కడుపులో సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
3. చాయ్, పెరుగు:
చాయ్, పెరుగులు ఒక ప్రాణాంతకమైన వేడి, చల్లని ఆహార కలయికకు ఒక అద్భుతమైన ఉదాహరణ. చాయ్ వేడిగా ఉంది. కాబట్టి చల్లని దహీ లేదా దహీ ఆధారిత వంటకాలను (పెరుగు శాండ్విచ్లు, దహీ కబాబ్తో సహా) జత చేయడం వల్ల మీ శరీరంలోని జీవక్రియ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతుంది.
4. మామిడి, పెరుగు:
మీరు మ్యాంగో షేక్కి పెరుగును జోడిస్తున్నట్లయితే ఇప్పుడే దాన్ని ఆపివేయండి. ఇది గొప్ప ఆహార కలయిక కాదు. దహీలో యానిమల్ ప్రొటీన్ ఉందని, పండ్లతో కలిపితే శరీరంలో కిణ్వ ప్రక్రియకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అజీర్ణం, అసిడిటీ, శరీరంలోని ఇతర సమస్యలను మరింతగా ప్రోత్సహిస్తుంది.
5. ఉల్లిపాయ, పెరుగు:
చాలా మంది రైతాలో తరిగిన ఉల్లిపాయలను కలుపుతూ ఉంటారు. ఉల్లిపాయలు డిష్కు అదనపు క్రంచ్ ఇస్తాయనేది నిజమైనప్పటికీ, అవి ఆరోగ్యంపై చెడు ప్రభావాలను కలిగిస్తాయి. ఉల్లి ప్రకృతిలో వేడిగా ఉంటుంది. రైతా చల్లగా ఉంటుంది. వీటిని కలిపినప్పుడు, ఇది మీ చర్మంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. మొటిమలు, చికాకు, దద్దుర్లు, మరిన్నింటికి సమస్యలకు ఇది దారితీస్తుంది.
6. చేపలు, పెరుగు:
చేపల, పెరుగుు.. రెండింటిలోనూ ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. భోజనంలో ప్రొటీన్లు అధికంగా ఉండే రెండు ఆహార పదార్థాలను కలపకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ప్రొటీన్లు ఒకేసారి జీర్ణం కావడం కష్టం.
7. పరాఠా, పెరుగు:
ఇది మీలో చాలా మందికి చెడ్డ వార్తగా అనిపిస్తుండొచ్చు. కానీ ఇది నిజం. పరాటాను లాంటి ఇతర వేయించిన ఆహారాలను పెరుగుతో కలిపి తినకూడదు. ఈ తరహా ఆహార పదార్ధాలను పెరుగుతో కలిపి తింటే జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా మరింత నీరసంగా అనిపిస్తుంది.