
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో సహా ఆయన సన్నిహితుల ఇళ్ల పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. టెండర్ స్కామ్ వ్యవహారంలో భాగంగా సాహిబ్గంజ్, బెర్హైత్, రాజ్మహల్ తో పాటుగా 18 ప్రాంతల్లో ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజాము నుంచే ఈడీ దాడులు చేస్తోంది. సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రా ఇండ్లలోనూ విస్తృతంగా ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. దాడుల సమయంతో ఈడీ పారామిలటరీ బలగాల సాయం కూడా తీసుకున్నారు. కాగా ఇప్పటికే సీఎం సోరెన్పై మైనింగ్ కుంభకోణం ఆరోపణలు రాగా, ఈ విషయంలో ఆయనకు ఈడీ గతంలోనే నోటీసులు జారీ చేసింది.
Enforcement Directorate (ED) conducts raid at the locations of Jharkhand CM Hemant Soren's MLA representative Pankaj Mishra. Raids going on at 18 locations, including Sahibganj, Berhait and Rajmahal in connection with a tender scam.
— ANI (@ANI) July 8, 2022
Visuals from Sahibganj in Jharkhand. pic.twitter.com/AQiBKR5sdH