- ఈడీ తనిఖీల్లో కట్టలు కట్టలుగా బయటపడిన నగదు
- టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో అధికారుల సోదాలు
- నగదును సీజ్ చేసిన అదికారులు
- టీఎంసీ నేతలు ఇష్టమున్నోళ్లకు జాబ్ ఇచ్చుకుని అవినీతికి పాల్పడ్డరు : బీజేపీ
కోల్కతా: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్పై విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు శుక్రవారం ఇద్దరు బెంగాల్ మంత్రుల ఇంట్లో తనిఖీలు చేశారు. పార్థ చటర్జీ, పరేష్ అధికారి ఇండ్లలో ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఈ సోదాలు నిర్వహించారు. అలాగే పార్థ చటర్జీ అనుచరురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లోనూ రెయిడ్లు చేశారు. ఈ సోదాల్లో అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల నగదు దొరికింది. కుప్పలు కుప్పలుగా పట్టుబడిన ఆ నగదును బ్యాంకు అధికారుల సాయంతో లెక్కించి సీజ్ చేశారు. ఆమె ఇంట్లోంచి 20 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల సమయంలో వారి నివాసాల బయట సీఆర్పీఎఫ్సిబ్బంది కాపలా కాశారు. ఉదయం 8.30 గంటలకు ఎనిమిది మంది అధికారులతో కూడిన ఓ బృందం చటర్జీ, అర్పిత నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహించగా.. మరో బృందం కూబ్బెహార్ జిల్లాలోని మేఖ్లీగంజ్లో పరేశ్అధికారి ఇంట్లో తనిఖీలు చేసింది. ఈ మూడు సోదాలన్నీ ఏకకాలంలో జరిగాయని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. అలాగే వెస్ట్బెంగాల్బోర్డ్ఆఫ్ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్మాణిక్భట్టాచార్య నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. బెంగాల్స్కూల్సర్వీస్కమిషన్రికమెండేషన్లపై గవర్నమెంట్స్పాన్సర్డ్ (ప్రభుత్వ ప్రాయోజిత), ఎయిడెడ్స్కూళ్లలో టీచర్పోస్టులతో పాటు గ్రూప్సీ, గ్రూప్డీ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది. ఆ దర్యాప్తులో భాగంగా ఎంత మేరకు డబ్బులు మారాయన్న దానిపై ఈడీ ఎంక్వయిరీ చేస్తున్నది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా ఉన్న పార్థ చటర్జీ.. ఈ స్కామ్ జరిగినపుడు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఆయనను ఈ ఏడాది ఏప్రిల్26న, మే 18న ప్రశ్నించింది. అలాగే విద్యాశాఖ సహాయ మంత్రి పరేశ్ అధికారిని కూడా కూచ్బెహార్లో ఈడీ విచారించింది. పరేశ్ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన కోల్కతాలో ఉన్నారు.
ఇది బీజేపీ కుట్ర: టీఎంసీ
రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే బీజేపీ సర్కారు కుట్రపన్నిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈడీని తమ నేతపై ఉసిగొల్పిందని మండిపడ్డారు. అయితే, టీచర్ రిక్రూట్మెంట్లో టీఎంసీ అక్రమాలకు పాల్పడిందని, నచ్చినవాళ్లకు పోస్టులు ఇచ్చుకున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ‘‘టీఎంసీ లీడర్లు, వాళ్ల అనుచరులు అర్హతలేని వ్యక్తులకు జాబ్లు ఇచ్చారు. ఈ విషయాన్ని ఈడీ, సీబీఐ తేలుస్తున్నాయి. ఈ స్కాంలో మరిన్ని తలకాయలు బయటపడతాయి” అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు.