- జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతా సిన్హా
- బీఆర్.అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్లో చర్చాగోష్టి
ముషీరాబాద్, వెలుగు: విద్య.. సమానత్వానికి బలమైన మార్గమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ శాంతా సిన్హా అన్నారు. బాగ్లింగంపల్లిలోని బీఆర్.అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్లో మొదటి తరం విద్యార్థి -విద్య ప్రజాస్వామ్య అంశంపై శనివారం చర్చాగోష్టి నిర్వహించారు. డాక్టర్ శాంతా సిన్హా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి, ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజా వివేక్ పాల్గొన్నారు. మొదటి తరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, విద్యాసంస్థల బాధ్యతలపై వారు దిశానిర్దేశం చేశారు.
కాకా వెంకటస్వామి సామాజిక న్యాయ సాధన కోసం విద్యను ప్రధాన సాధనంగా భావించి ఈ సంస్థలను స్థాపించారన్నారు. వెనుకబడిన వర్గాల వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో విద్యాసంస్థల కార్యకలాపాలకు కాకా మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. ఇన్స్టిట్యూషన్సీఈవో ప్రొ.లింబాద్రి, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, విద్యార్థులు ఉన్నారు.
